Wednesday, February 26, 2020

MY STUDENT POETRY

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కట్టమూరు, పెద్దాపురం మండలం, లో చదువుచున్న 6వ తరగతి విద్యార్థి చిరంజీవి పి. వినయ్ కుమార్ స్వయంగా  వ్రాసినపద్యాలు. 

(1)

జ్ఙానమిచ్చు గురువులమీద చాడీలు చెప్పకు 
అక్కడ మాటలు ఇక్కడ చెప్ప నీచులారా 
గురువు శిక్షించుట మన మంచికేరా !
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా  !

(2)

అవసరానికి మించి ఆహరం తయారీ వృధారా  !
ఆకలితో ఉన్నవారికి అందించారా!
ఆకలితో మరణించు ఎన్నో జీవులు 
సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !

(3)

భవిత పెరుగు నీటికరువు 
నీరులేని యెడల పంటలు ఎట్లా పండు  !
నీటి అనవసరంగా వాడకురా !
 సత్యమిది తెలుసుకో ! వినయకుమారా !